నాదం, రాగం, లయ, మ్యూజిక్, ఫ్రీక్వెన్సీ, వేవ్లెన్త్ అన్నీ సైన్సే! ఇవన్నీ శరీరంలో ఎముకల లాంటివి. లోన ఉన్నవాటిని గమనించం. కండ, చర్మం చూసి అందం బేరీజు వేస్తాం. ఎలక్ట్రిక్ బల్బు ఎంత అందంగా ఉన్నా, లోన ఫిలమెంట్ పోతే బల్బు పనికిరాదు. ఫిలమెంట్ సైన్స్ ప్రిన్సిపల్ మీద తయారయ్యింది. గాజు బల్బూ సైన్సు వల్ల వచ్చిందే. మనవాళ్లు గుళ్ళూ, గోపురాలు చూసి ఆనాటి ఇంజనీరింగ్ ప్రతిభ గుర్తించరు. అందులో కల్పించుకున్న ఒక దేవుణ్ణి, శక్తిని... వారి మహత్మ్యాల్ని ప్రవచిస్తుంటారు. వారికి వారే పరవశించిపోతుంటారు. రామాయణ, భారత, భాగవతాలు, పురాణాలు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అవే పాత కథలు. మనిషి ఔన్నత్యం ఎక్కడైనా కనిపిస్తుందా? మనిషి, దైవత్వానికి దాసోహం అయిన గాథలు మహోన్నతంగా చెప్పడమే గానీ మరొకటుందా? దైనందిన జీవితంలో దేవుడి ప్రసక్తి, సంభాషణల్లో దైవం, హితబోధలో దైవం, సంగీతంలో దైవం, సాహిత్యంలో దైవం, నాట్యంలో దైవం... మనిషి ఆత్మవిశ్వాసం దెబ్బతీసే కళారూపాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నప్పుడు, తరతరాలకు ఆ జాడ్యం వ్యాపించక ఏమవుతుందీ? ఇవన్నీ చాలవన్నట్టు ప్రవచాల పేరుతో కొందరు తమ తుప్పుపట్టిన భావజాలం ప్రచారం చేస్తుంటారు. మనుస్మృతిలోని విషయాలే గొప్పగా చేసి వర్ణిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆధునిక ఆలోచనా ధోరణికి ఏమాత్రం సరిపడని విషయాలు కదా?
మన రోజువారీ సంభాషణల్లో 'అంతా దేవుడిదయ' -
'అంతా పైవాడు చూసుకుంటాడు' - 'ఈశ్వరాజ్ఞ లేనిది చీమైనా కదలదు' లాంటి మాటలు
వింటూ ఉంటాం. ఏమీ తెలియని పసిపాపలకు 'జేజకొడతాడు దండం పెట్టు' - 'జేజ
తీసుకు పోయాడు' - 'దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది' లాంటి మాటలు పసితనంలోనే
నూరిపోస్తుంటారు. సామాన్యుడు చస్తాడు / కన్ను మూస్తాడు / మరణిస్తాడు. కానీ
ఆధ్యాత్మిక గురువులు ఈశ్వరుడిలో ఐక్యమైపోతారు. చచ్చాడని గౌరవంగా చెప్పడం...
అంతే, జీవశాస్త్రపరంగా ఏ చావైనా ఒకటే! ఇంతెందుకూ నాస్తిక, హేతువాద
సంఘాల్లో పనిచేస్తున్న వారందరివీ దేవుడి పేర్లే. అవన్నీ వాళ్ళు
పెట్టుకున్నవి కావు. ఆనవాయితీ ప్రకారం పెద్దలు పెడుతూ, పెడుతూ ఉండగా
వచ్చినవి. నా ఇంటిపేరులో కూడా దేవ శబ్దం ఉంది. అది నేను పెట్టుకున్నది
కాదు.
ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న విషయాలు. మనకు అనుభవంలోకి వస్తున్న విషయాలు. మరి ప్రపంచమంతా ఇలాగే ఉందా - అంటే లేదు. కొంచెం స్థాయి పెంచుకుని, విశాల హృదయంతో ప్రపంచ దేశాల్లోని పరిస్థితిని గమనిస్తే మనం ఎక్కడ ఉన్నామన్నది అర్థం చేసుకోవచ్చు.
మతరహిత ప్రజలు దేశాల వారిగా ఈ విధంగా ఉన్నారు. ఎస్తోనియా-76.5శాతం, జపాన్-76శాతం; డెన్మార్క్-72 శాతం; స్వీడన్-64శాతం; వియత్నాం-62,5 శాతం; మకాల్-60.9శాతం; జెక్ రిపబ్లిక్-57.5శాతం; హాంకాంగ్- 57శాతం; ఫ్రాన్స్-53.5శాతం; నార్వే-51.5శ ాతం, చైనా-47శాతం; నెదర్లాండ్-47శాతం; ఫిన్లాండ్-44 శాతం; ఇంగ్లాండు-41.5శాతం; దక్షిణ కొరియా-41శాతం; జర్మనీ-40శాతం; హంగరి-39శాతం; బెల్జియం-38.75 శాతం; బల్గేరియా 37శాతం; సోమేనియా-36.15శాతం; న్యూజిల్యాండ్-34.7శాతం; రష్యా-30.5శాతం; అమెరికా- 20శాతం. ఇంతకూ మన భారతదేశంలో మతరహిత జనాభా ఎంత అని ఆతురతగా వెతుక్కునే వారి కోసం ఇక్కడ ఇస్తున్నాను. భారతదేశంలో మతరహిత ప్రజలు 0.6శాతం. ఈ వివరాలన్నీ ఇవ్వడం ఎందుకంటే ప్రపంచదేశాలలో మనమెక్కుడున్నామన్నది బేరీజు వేసుకోవడానికి! దేవుడు-దయ్యాల భావనల్లోంచి, సంప్రదాయం, ఆచారాల పేరుతో మూఢనమ్మకాల కొనసాగింపులోంచి బయటపడి, ఇకనైనా ఆధునిక వైజ్ఞానిక సమాజానికి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి!! నవంబర్ 6, 2015న 'ద గార్డియన్' ఇంగ్లీషు పత్రిక ఈ విధంగా ప్రకటించింది. ''మత రహిత సంస్కృతి, ప్రజాస్వామిక వాతావరణం ఉన్న కొన్ని దేశాల్లో నేరాల శాతం తగ్గి, కొన్ని జైళ్ళు కూడా మూసేస్తున్నారు. అంతే కాదు, ప్రపంచ దేశాల్లో జరిపిన ఒక సర్వే.. మతాన్ని ఆచరించే కుటుంబాల పిల్లలతో పోల్చినప్పుడు... వీరి కంటే మతరహిత కుటుంబాల పిల్లలు దయగల వారుగా, నైతికంగా పద్ధతి గలవారుగా ఉన్నారని వెల్లడించింది. అంటే, 'దేవుడున్నాడు అన్న భావన ప్రజల్ని నైతికంగా మంచి దారిలో ఉంచుతుంది' అన్న వాదనకు ఈ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.
ఈ కాలంలో తెలివి తేటల్ని ఐక్యూ లెవెల్స్తో కొలుస్తున్నాం. ఐక్యూ అంటే ఇంటిలిజెంట్ క్వొటియెంట్ లెవెల్స్. ఇవి దేవుణ్ణి నమ్మే వారిలో నమ్మనివారిలో ఎలా ఉన్నాయి అనే పరిశీలన జరిగింది. దాని ఫలితం ఏమొచ్చిందంటే నాస్తికుల ఐక్యూ లెవెల్స్ 115-125 మధ్య ఉంది. ఇంకొందరిలో 125 కంటే ఎక్కువగా కూడా ఉంది. అదే ఆస్తికుల విషయానికొస్తే అది 85-115 మధ్య ఉంది. మరికొందరిలో ఇంకా తక్కువగా 75 మాత్రమే ఉంది. మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని సరాసరి గనక లెక్కగడితే, 90శాతం మంది జనం ఐక్యూ 85-115 మధ్య ఉంది. ఆపైన ఉన్నవారు 5శాతమైతే, 85కు తక్కువ మరో 5శాతం మంది ఉన్నారు. దీనివల్ల కూడా ఒక విషయం తేటతెల్లమౌతోంది. దైవభ్రాంతి, దైవచింతన, దైవభక్తి లేదా దేవుడంటే భయపడే జనాభా ప్రపంచంలో అధికంగా ఉంది. మనిషి సృష్టించుకున్న అతి భయంకరమైన భావన ఏమిటంటే అది దేవుడే. అందులోంచి బయటపడాల్సింది మనిషే. ఖండాంతరాలను అధిగమించిన మానవుడు, పర్వతాలను దాటిన మానవుడు సముద్రాలను దాటిన మానవుడు, రోదసీ జయించిన మానవుడు... తన మూఢనమ్మకాలను తనే వదిలించుకోక పోవడం విచారకరం.
దేవుడు లేడు, లేడు, లేడు.. అని ఘంటాపథంగా చెప్పిన పెరియర్ ఒక మాట చెప్పాడు. ''నీ బుద్ధి పని చేయడం ప్రారంభిస్తే అక్కడ భక్తి నిలవదు. నీ బుద్ధి బద్ధకిస్తే, అక్కడ నీ మీద భక్తి పెత్తనం చేస్తుందీ అని!'' ఒకసారి ఒకతను పరియార్తో వాదులాటకు దిగాడు. ''దేవుణ్ణి రాయిగా తేల్చేయకండి! అదిప్పుడు రాయి కాదు, మంత్రోచ్ఛారణతో దాన్ని దేవుణ్ణి చేశాం'' అని అన్నాడు. ''రాయినే దేవుణ్ణి చేయగల శక్తిగలవారు కదా? అట్టడుగు వర్ణాల వారిని మంత్రోచ్ఛారణతో అగ్రవర్ణాల వారిగా చేయండి! మనుషులంతా సమానులై సమస్యలు లేకుండా పోతాయి కదా?'' అని ప్రశ్నించాడు పెరియార్! ఆనాటి ఆయన ప్రశ్నకి ఈనాటికీ జవాబు లేదు. హిందూమతం గూర్చి ప్రపంచానికి మహోపన్యాసం ఇచ్చిన వివేకానందుడే ఆ తర్వాతి కాలంలో ఏమన్నాడో పరిశీలించండి. ''ఏ హేతు పరిశీలన వల్ల కనుగొనబడ్డ విషయాలు ప్రతి విజ్ఞాన శాస్త్రాన్ని రుజువు చెయ్యడానికి కారణభూతాలవుతున్నాయో, వాటి సహాయంతో మతమూ నిరూపించబడాలా? అంటే అవుననే నా అభిప్రాయం! ఈ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఒకవేళ అలాంటి పరిశోధనల వల్ల మతం నశించే పక్షంలో ఇంతకాలంగా అది నిష్ప్రయోజనమైందని, అనుచితమైన అంధవిశ్వాసమని తెలుస్తూ ఉంది. కాబట్టి, అదెంత త్వరగా నశిస్తే అంత మంచిది. అది పోవటం కంటే మేలైన పని మరొకటి ఉండబోదని నా నిశ్చితాభిప్రాయం! పనికి మాలిందంతా పోతుందనడం నిస్సందేహం.''
ఒకప్పుడు దైవభావనకు మహిమలు ఆపాదించినట్టే, ఇప్పుడు వ్యాపార సినిమా హీరోలకి సాహసాలు ఆపాదించి జనం ఆనందిస్తున్నారు. ఊహలు, అబద్దాలు జనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. నిజాలు, వాస్తవాలు కటువుగానే ఉంటాయి. మనకు తెలుసు, వాస్తవానికి నటీనటులు సాహసవంతులు కారు. సామాన్యులు చేయగలిగే పనులు కూడా వారు చేయలేరు. ఉదాహరణకు వందల కిలోల బరువు మోయగలిగే హమాలీలున్నారు. మండుటెండలో 20 కి.మీ. రిక్షా తొక్కేవాళ్ళున్నారు. ఐదారు కి.మీ. మంచినీళ్ళ బిందెలు మోసే గృహిణులున్నారు. నటన కాదు, తప్పని సరై వాళ్ళలా చేస్తున్నారు. ఇవన్నీ మన కమర్షియల్ సినీ హీరో, హీరోయిన్లు చేయగలరా? చేయలేరు. అలా ఒళ్ళు హూనం చేసుకుని బతికేవాళ్ళు కాసేపు వెండి తెరమీద ఊహలు, భ్రమలు, అబద్దాలు చూసి ఆనందిస్తారు. ఇదే విధంగా తాము చేయలేని పనులు తాము కల్పించుకున్న భగవంతుడు అవలీలగా చేస్తాడని జనం నమ్మారు. ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఆ భావన నిలవడానికి అనాదిగా అన్ని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కథలో, నవలల్లో కల్పిత పాత్రలు పాఠకుల్ని ఏదో ఊహా ప్రపంచంలోకి తీసుకుపోతాయి కదా? ఈ దైవభావన అంతే అని అర్థం చేసుకోవాలి!
ఎంత చదివారు? ఎంత ఎదిగారు? ఎన్నికోట్లు కూడబెట్టారు? ఎన్ని మేడలు కట్టుకున్నారు? ఎంతటి ఖరీదైన కార్లలో తిరిగారూ ఇవి ముఖ్యం కాదు. కాస్త వివేకంతో కూడిన ఎదుగుదల, కాస్త విజ్ఞానంతో కూడిన ప్రవర్తన కావాలి. విచారించాల్సిన విషయమేమంటే ఎలక్ట్రానిక్ మీడియా బాగా పెరిగాక అర్థం, పర్థం లేని మూఢత్వం బాగా పెరుగుతోంది. బాబాలు, స్వామీజీలు, అమ్మలు, దద్దమ్మలు గంటల తరబడి టీవీల ద్వారా ఇంటింటా అవివేకాన్ని, మూఢత్వాన్ని వెదజల్లుతున్నారు. అందుకే శాస్త్రీయమైన చదువు కావాలంటున్నాం. నిరూపణకు నిలబడనివి 'నమ్మకం' స్థాయిలో ఉంటే భరించొచ్చు. కానీ అవి 'అమ్మకం' స్థాయికొచ్చేస్తున్నాయి. కాబట్టి సామాన్య జనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. శాంతి పూజలు చేయిస్తానని, పరమాన్నంలో మత్తుమందు కలిపి, 1.33 కోట్ల నగదు కాజేసిన ఒక బాబా ఉదంతం హైదరాబాద్, బంజారాహిల్స్లో వెలుగులోకి వచ్చింది కదా? మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఒకవైపున ఉంటే, ఇంగిత జ్ఞానం ఉపయోగించని ధనిక మూర్ఖశిఖామణులు ఏ స్థాయిలో ఉన్నారనేది మరొక వైపున ఉందికదా?
ఏ మతమూ శాంతికి స్వర్గధామం కాదు. హింసను ప్రోత్సహించే మౌలికాంశాలు ప్రతి మతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా గతాన్ని తవ్వి చెప్పుకోనవసరం లేదు. ఇంతెందుకూ? ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న హింసలో ఎక్కువ శాతం మతం నేపథ్యంలో జరుగుతున్నదే కదా? అందువల్ల ఏ మతమూ నిర్దిష్టం కాదు. అన్నింటిలో లోపాలున్నాయి. ఇది మెరుగైంది. ఇది స్వచ్ఛమైంది అని ఏ మతానికీ మొదటి స్థానం ఇవ్వలేం. మనిషి కేంద్రంగా అతను సాధించిన విజయాలు కేంద్రకంగా చేసుకుని, మానవతా వాదాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో తప్పకుండా మనం చాదస్తాల్ని, మూఢ నమ్మకాల్ని వదిలేయ గలం. మత రహిత సమాజాన్ని ఏదో ఓ నాటికి రూపొందించుకోగలం!
వ్యాసకర్త ప్రముఖ సాహితీ వేత్త, జీవశాస్త్రవేత్త,
సెల్: 9908633949
డాక్టర్ దేవరాజు మహారాజు ( నవ తెలంగాణ సౌజన్యంతో)
ఇవన్నీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తున్న విషయాలు. మనకు అనుభవంలోకి వస్తున్న విషయాలు. మరి ప్రపంచమంతా ఇలాగే ఉందా - అంటే లేదు. కొంచెం స్థాయి పెంచుకుని, విశాల హృదయంతో ప్రపంచ దేశాల్లోని పరిస్థితిని గమనిస్తే మనం ఎక్కడ ఉన్నామన్నది అర్థం చేసుకోవచ్చు.
మతరహిత ప్రజలు దేశాల వారిగా ఈ విధంగా ఉన్నారు. ఎస్తోనియా-76.5శాతం, జపాన్-76శాతం; డెన్మార్క్-72 శాతం; స్వీడన్-64శాతం; వియత్నాం-62,5 శాతం; మకాల్-60.9శాతం; జెక్ రిపబ్లిక్-57.5శాతం; హాంకాంగ్- 57శాతం; ఫ్రాన్స్-53.5శాతం; నార్వే-51.5శ ాతం, చైనా-47శాతం; నెదర్లాండ్-47శాతం; ఫిన్లాండ్-44 శాతం; ఇంగ్లాండు-41.5శాతం; దక్షిణ కొరియా-41శాతం; జర్మనీ-40శాతం; హంగరి-39శాతం; బెల్జియం-38.75 శాతం; బల్గేరియా 37శాతం; సోమేనియా-36.15శాతం; న్యూజిల్యాండ్-34.7శాతం; రష్యా-30.5శాతం; అమెరికా- 20శాతం. ఇంతకూ మన భారతదేశంలో మతరహిత జనాభా ఎంత అని ఆతురతగా వెతుక్కునే వారి కోసం ఇక్కడ ఇస్తున్నాను. భారతదేశంలో మతరహిత ప్రజలు 0.6శాతం. ఈ వివరాలన్నీ ఇవ్వడం ఎందుకంటే ప్రపంచదేశాలలో మనమెక్కుడున్నామన్నది బేరీజు వేసుకోవడానికి! దేవుడు-దయ్యాల భావనల్లోంచి, సంప్రదాయం, ఆచారాల పేరుతో మూఢనమ్మకాల కొనసాగింపులోంచి బయటపడి, ఇకనైనా ఆధునిక వైజ్ఞానిక సమాజానికి రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి!! నవంబర్ 6, 2015న 'ద గార్డియన్' ఇంగ్లీషు పత్రిక ఈ విధంగా ప్రకటించింది. ''మత రహిత సంస్కృతి, ప్రజాస్వామిక వాతావరణం ఉన్న కొన్ని దేశాల్లో నేరాల శాతం తగ్గి, కొన్ని జైళ్ళు కూడా మూసేస్తున్నారు. అంతే కాదు, ప్రపంచ దేశాల్లో జరిపిన ఒక సర్వే.. మతాన్ని ఆచరించే కుటుంబాల పిల్లలతో పోల్చినప్పుడు... వీరి కంటే మతరహిత కుటుంబాల పిల్లలు దయగల వారుగా, నైతికంగా పద్ధతి గలవారుగా ఉన్నారని వెల్లడించింది. అంటే, 'దేవుడున్నాడు అన్న భావన ప్రజల్ని నైతికంగా మంచి దారిలో ఉంచుతుంది' అన్న వాదనకు ఈ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.
ఈ కాలంలో తెలివి తేటల్ని ఐక్యూ లెవెల్స్తో కొలుస్తున్నాం. ఐక్యూ అంటే ఇంటిలిజెంట్ క్వొటియెంట్ లెవెల్స్. ఇవి దేవుణ్ణి నమ్మే వారిలో నమ్మనివారిలో ఎలా ఉన్నాయి అనే పరిశీలన జరిగింది. దాని ఫలితం ఏమొచ్చిందంటే నాస్తికుల ఐక్యూ లెవెల్స్ 115-125 మధ్య ఉంది. ఇంకొందరిలో 125 కంటే ఎక్కువగా కూడా ఉంది. అదే ఆస్తికుల విషయానికొస్తే అది 85-115 మధ్య ఉంది. మరికొందరిలో ఇంకా తక్కువగా 75 మాత్రమే ఉంది. మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని సరాసరి గనక లెక్కగడితే, 90శాతం మంది జనం ఐక్యూ 85-115 మధ్య ఉంది. ఆపైన ఉన్నవారు 5శాతమైతే, 85కు తక్కువ మరో 5శాతం మంది ఉన్నారు. దీనివల్ల కూడా ఒక విషయం తేటతెల్లమౌతోంది. దైవభ్రాంతి, దైవచింతన, దైవభక్తి లేదా దేవుడంటే భయపడే జనాభా ప్రపంచంలో అధికంగా ఉంది. మనిషి సృష్టించుకున్న అతి భయంకరమైన భావన ఏమిటంటే అది దేవుడే. అందులోంచి బయటపడాల్సింది మనిషే. ఖండాంతరాలను అధిగమించిన మానవుడు, పర్వతాలను దాటిన మానవుడు సముద్రాలను దాటిన మానవుడు, రోదసీ జయించిన మానవుడు... తన మూఢనమ్మకాలను తనే వదిలించుకోక పోవడం విచారకరం.
దేవుడు లేడు, లేడు, లేడు.. అని ఘంటాపథంగా చెప్పిన పెరియర్ ఒక మాట చెప్పాడు. ''నీ బుద్ధి పని చేయడం ప్రారంభిస్తే అక్కడ భక్తి నిలవదు. నీ బుద్ధి బద్ధకిస్తే, అక్కడ నీ మీద భక్తి పెత్తనం చేస్తుందీ అని!'' ఒకసారి ఒకతను పరియార్తో వాదులాటకు దిగాడు. ''దేవుణ్ణి రాయిగా తేల్చేయకండి! అదిప్పుడు రాయి కాదు, మంత్రోచ్ఛారణతో దాన్ని దేవుణ్ణి చేశాం'' అని అన్నాడు. ''రాయినే దేవుణ్ణి చేయగల శక్తిగలవారు కదా? అట్టడుగు వర్ణాల వారిని మంత్రోచ్ఛారణతో అగ్రవర్ణాల వారిగా చేయండి! మనుషులంతా సమానులై సమస్యలు లేకుండా పోతాయి కదా?'' అని ప్రశ్నించాడు పెరియార్! ఆనాటి ఆయన ప్రశ్నకి ఈనాటికీ జవాబు లేదు. హిందూమతం గూర్చి ప్రపంచానికి మహోపన్యాసం ఇచ్చిన వివేకానందుడే ఆ తర్వాతి కాలంలో ఏమన్నాడో పరిశీలించండి. ''ఏ హేతు పరిశీలన వల్ల కనుగొనబడ్డ విషయాలు ప్రతి విజ్ఞాన శాస్త్రాన్ని రుజువు చెయ్యడానికి కారణభూతాలవుతున్నాయో, వాటి సహాయంతో మతమూ నిరూపించబడాలా? అంటే అవుననే నా అభిప్రాయం! ఈ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఒకవేళ అలాంటి పరిశోధనల వల్ల మతం నశించే పక్షంలో ఇంతకాలంగా అది నిష్ప్రయోజనమైందని, అనుచితమైన అంధవిశ్వాసమని తెలుస్తూ ఉంది. కాబట్టి, అదెంత త్వరగా నశిస్తే అంత మంచిది. అది పోవటం కంటే మేలైన పని మరొకటి ఉండబోదని నా నిశ్చితాభిప్రాయం! పనికి మాలిందంతా పోతుందనడం నిస్సందేహం.''
ఒకప్పుడు దైవభావనకు మహిమలు ఆపాదించినట్టే, ఇప్పుడు వ్యాపార సినిమా హీరోలకి సాహసాలు ఆపాదించి జనం ఆనందిస్తున్నారు. ఊహలు, అబద్దాలు జనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. నిజాలు, వాస్తవాలు కటువుగానే ఉంటాయి. మనకు తెలుసు, వాస్తవానికి నటీనటులు సాహసవంతులు కారు. సామాన్యులు చేయగలిగే పనులు కూడా వారు చేయలేరు. ఉదాహరణకు వందల కిలోల బరువు మోయగలిగే హమాలీలున్నారు. మండుటెండలో 20 కి.మీ. రిక్షా తొక్కేవాళ్ళున్నారు. ఐదారు కి.మీ. మంచినీళ్ళ బిందెలు మోసే గృహిణులున్నారు. నటన కాదు, తప్పని సరై వాళ్ళలా చేస్తున్నారు. ఇవన్నీ మన కమర్షియల్ సినీ హీరో, హీరోయిన్లు చేయగలరా? చేయలేరు. అలా ఒళ్ళు హూనం చేసుకుని బతికేవాళ్ళు కాసేపు వెండి తెరమీద ఊహలు, భ్రమలు, అబద్దాలు చూసి ఆనందిస్తారు. ఇదే విధంగా తాము చేయలేని పనులు తాము కల్పించుకున్న భగవంతుడు అవలీలగా చేస్తాడని జనం నమ్మారు. ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఆ భావన నిలవడానికి అనాదిగా అన్ని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కథలో, నవలల్లో కల్పిత పాత్రలు పాఠకుల్ని ఏదో ఊహా ప్రపంచంలోకి తీసుకుపోతాయి కదా? ఈ దైవభావన అంతే అని అర్థం చేసుకోవాలి!
ఎంత చదివారు? ఎంత ఎదిగారు? ఎన్నికోట్లు కూడబెట్టారు? ఎన్ని మేడలు కట్టుకున్నారు? ఎంతటి ఖరీదైన కార్లలో తిరిగారూ ఇవి ముఖ్యం కాదు. కాస్త వివేకంతో కూడిన ఎదుగుదల, కాస్త విజ్ఞానంతో కూడిన ప్రవర్తన కావాలి. విచారించాల్సిన విషయమేమంటే ఎలక్ట్రానిక్ మీడియా బాగా పెరిగాక అర్థం, పర్థం లేని మూఢత్వం బాగా పెరుగుతోంది. బాబాలు, స్వామీజీలు, అమ్మలు, దద్దమ్మలు గంటల తరబడి టీవీల ద్వారా ఇంటింటా అవివేకాన్ని, మూఢత్వాన్ని వెదజల్లుతున్నారు. అందుకే శాస్త్రీయమైన చదువు కావాలంటున్నాం. నిరూపణకు నిలబడనివి 'నమ్మకం' స్థాయిలో ఉంటే భరించొచ్చు. కానీ అవి 'అమ్మకం' స్థాయికొచ్చేస్తున్నాయి. కాబట్టి సామాన్య జనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. శాంతి పూజలు చేయిస్తానని, పరమాన్నంలో మత్తుమందు కలిపి, 1.33 కోట్ల నగదు కాజేసిన ఒక బాబా ఉదంతం హైదరాబాద్, బంజారాహిల్స్లో వెలుగులోకి వచ్చింది కదా? మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఒకవైపున ఉంటే, ఇంగిత జ్ఞానం ఉపయోగించని ధనిక మూర్ఖశిఖామణులు ఏ స్థాయిలో ఉన్నారనేది మరొక వైపున ఉందికదా?
ఏ మతమూ శాంతికి స్వర్గధామం కాదు. హింసను ప్రోత్సహించే మౌలికాంశాలు ప్రతి మతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా గతాన్ని తవ్వి చెప్పుకోనవసరం లేదు. ఇంతెందుకూ? ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న హింసలో ఎక్కువ శాతం మతం నేపథ్యంలో జరుగుతున్నదే కదా? అందువల్ల ఏ మతమూ నిర్దిష్టం కాదు. అన్నింటిలో లోపాలున్నాయి. ఇది మెరుగైంది. ఇది స్వచ్ఛమైంది అని ఏ మతానికీ మొదటి స్థానం ఇవ్వలేం. మనిషి కేంద్రంగా అతను సాధించిన విజయాలు కేంద్రకంగా చేసుకుని, మానవతా వాదాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో తప్పకుండా మనం చాదస్తాల్ని, మూఢ నమ్మకాల్ని వదిలేయ గలం. మత రహిత సమాజాన్ని ఏదో ఓ నాటికి రూపొందించుకోగలం!
వ్యాసకర్త ప్రముఖ సాహితీ వేత్త, జీవశాస్త్రవేత్త,
సెల్: 9908633949
డాక్టర్ దేవరాజు మహారాజు ( నవ తెలంగాణ సౌజన్యంతో)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి